telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మరోసారి లోకేశ్‌ అలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు: లక్ష్మీపార్వతి హెచ్చరిక

lakshmiparvati fire on chandrababu

మహిళలను కించపరిచేలా లోకేశ్‌ మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. . ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించ్కున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరిగి బాగుపడాలంటే వెంటనే లోకేశ్ ను పక్కన బెట్టాలని సూచించారు.

లోకేశ్‌ ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుందన్నారు. చంద్రబాబుకు తానిచ్చే సలహా ఇదేనని చెప్పారు. రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో ప్రజా పరిపాలన సాగుతోందని, ఇల్లు బాగు చేస్తూంటే ఎలుకలు ఏడ్చినట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నేడు లక్ష్మీపార్వతిపాటు పలువురు ప్రముఖులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. నేడు తన పుట్టినరోజు కావడంతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా తిరుమలకు వచ్చారు. ఎమ్మెల్యేలు ద్వారకానాథ్‌ రెడ్డి, కాకాణి గోవర్థన్‌ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు

Related posts