సార్వత్రిక ఎన్నికల నామినషన్ ప్రక్రియ సోమవారం పూర్తికావడంతో అధికారులు మంగళవారం పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం ఎన్నికలకు దాఖలైన 16 మంది దరఖాస్తులలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి గౌతమ్రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తి నామినేషన్ను ఎన్నిక ల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 14 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్రెడ్డిలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి చేవూరు శ్రీధర్రెడ్డి, బీజేపీ అభ్యర్థి కర్నాటి ఆంజనేయ రెడ్డి, జనసేన అభ్యర్థి చీర్ల చిన్నారెడ్డి, బీఎస్పీ అభ్యర్థి మందల పద్మజ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మూరంరెడ్డి వెంకటేశ్వర్లు, మరో ఏడుగురు స్వతంత్య్ర అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.
రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదు: భట్టి విక్రమార్క