మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన రాజకీయ జీవితాన్ని పాదయాత్ర ఎలాంటి మలుపులు తిప్పిందో అందరికి తెలిసిందే. ఆ అంశాన్ని ప్రధాన కథగా తీసుకుని దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితచరిత్రపై తెరకెక్కిన చిత్రం యాత్ర. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8, 2019న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలోని భావోద్వేగ సన్నివేశాల సమాహారంగా సాగిన ఈ చిత్రానికి భారీ ఆదరణ లభించింది. అయితే ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, తనయుడు జగన్ పాత్రలు లేకుండా ముగించారు. వారి పాత్రలు లేకుండా రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర అసంపూర్ణం. యాత్ర 2 ద్వారా అది పూర్తి చేస్తాం. యాత్ర సినిమాని వైఎస్ జగన్ విజువల్స్తో ముగించాం. యాత్ర-2 ని అక్కడి నుండే స్టార్ట్ చేయాలనే ఆలోచనతో చేశాం అని దర్శకుడు మహీ వి రాఘవ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు తెలుస్తుంది.
previous post
next post
ఈ అగ్ర దర్శకుడిని కొట్టి థియేటర్ నుంచి తరిమేశారట…!