చంద్రబాబు ప్రభుత్వానికి తెలుగంటే గౌరవం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలోని నేలపాడులో ఈ భవనాన్ని నిర్మించారు.
హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని ఇంగ్లీష్లోనే ముద్రించారని ఆరోపించారు. చట్టం ప్రకారం శిలాఫలకాలపై తెలుగులో రాయాలని ఆయన అన్నారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైనా ఇంగ్లీష్లోనే ముద్రించారని, టీడీపీ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు.
విద్యార్థులు వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం…