`118` వంటి సూపర్హిట్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ రెండో చిత్రంగా తెలుగు, తమిళ భాషలలో రూపొందిస్తోన్నమిస్టరి థ్రిల్లర్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`(ఎవరు, ఎక్కడ, ఎందుకు). అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు ధాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలచేసిన ప్రీలుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ టీజర్ వచ్చింది.
previous post