గురుకుల విద్యాలయాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల నియామక రాత పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు గాను హైదరాబాద్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తంగా 19,888 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 14, 15, 17 తేదీల్లో డిగ్రీ లెక్చరర్లు, 16, 17 తేదీల్లో జూనియర్ లెక్చరర్లకు పలు రకాలైన సబ్జెక్ట్లకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్, పరీక్షల చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ జి.రవి, జిల్లా ఇన్చార్జి డీఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు.