ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా సునామీ సృష్టించడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కీరవాణి.. టీమ్ వర్క్తో ఖండాంతరాల్లో తెలుగు పరిశ్రమ గొప్ప ఘనత సాధించింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా టీమంతా లండన్లో ఒకే వేదికపై సందడి చేయనుంది. ఓ ప్రఖ్యాత అంతర్జాతీయ వేదికపై వీరు కలవబోతున్నారు. బాహుబలి సినిమా టీమ్ అంతా సూర్యుడు అస్తమించని దేశం బ్రిటన్లో ఒకే వేదికపై సందడి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ నెల 19న “బాహుబలి: ద బిగినింగ్” తోపాటు స్కైఫాల్, హ్యారీపోట్టర్ వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ టీమ్ మొత్తం ఆ వేదికపై కలవబోతున్నారు. కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది. 19వ తేదీన సాయంత్రం 7 గంటలకు బాహుబలి సినిమాను రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించనున్నారు.
previous post
next post