మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాచిన్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది దుర్మరణం చెందారు. కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో నిండిపోయాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది.
ప్రమాదవశాత్తు కార్మికులు ఆ బురద నీటిలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మృత్యువాతపడ్డారు.