telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మయన్మార్ గనుల్లో ఘోర ప్రమాదం.. బురదలో చిక్కుకుని 113 మంది మృతి

Workers Death Myanmar

మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాచిన్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది దుర్మరణం చెందారు. కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో నిండిపోయాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది.

ప్రమాదవశాత్తు కార్మికులు ఆ బురద నీటిలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మృత్యువాతపడ్డారు.

Related posts