telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టోక్యో ఒలింపిక్స్‌కు … భారత మహిళా హాకీ జట్టు …

women hockey team in a step to tokyo Olympics

భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. భువనేశ్వర్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్‌ రెండో మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో 1-4 తేడాతో ఓడినా గోల్స్‌ లెక్కలతో భారత్ ఒలింపిక్స్‌కు బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇదే వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 5-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచుల్లో కలిపి మొత్తంగా భారత్ అమెరికా కంటే గోల్‌ ఆధిక్యంలో నిలవడటంతో రాణి సేన టోక్యో విమానం ఎక్కనుంది.

ఈ మ్యాచ్‌ లో ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది. ఐదో నిమిషంలోనే మగదన్‌ గోల్‌ కొట్టడంతో అమెరికా ఖాతా తెరిచింది. మూడో క్వార్టర్‌ ముగిసేసరికి యూఎస్‌ఏ 4-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత్‌ ఎంత ప్రయత్నించినా గోల్‌ సాధ్యపడలేదు. దూకుడుగా ఉన్న అమెరికా జట్టును చూసి భారత ఒలింపిక్స్‌ ఆశలకు గండిపడుతుందని భావించారంతా. కానీ, ఆఖరి క్వార్టర్‌లో కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్ కొట్టడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రతిఘటించినా రాణిసేన ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.

Related posts