telugu navyamedia
సినిమా వార్తలు

“వారిని సన్మానించడం గర్వంగా వుంది”- జయసుధ

Womans Day Special Jayasudha In FilmNagar
దేశంలో అన్ని రంగాల్లో మహిళలు  పురుషులతోపాటు  దూసుకపోతున్నారని , ఇది ఎంతో అందించతగ్గ విషయమని , మహిళా దినోత్సవ సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్  సెంటర్ మేజర్ పద్మపాణి ఆచార్య భార్య శ్రీమతి చారులత ఆచార్య ,,మరో ఆర్మీ అధికారి భార్య  కిరణ్ ఉనియల్ ను సత్కరించడం ఎంతో సముచితంగా ఉందని శ్రీమతి  జయ సుధ చెప్పారు . 
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం రోజు మహిళా దినోత్సవం  జరిగింది . శ్రీమతి జయసుధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా  జయసుధ మాట్లాడుతూ , దేశానికి నిరంతరం సేవలు అందించే సైనికుల గురించి ఎంత  చెప్పుకున్నా తక్కువేనని , దేశ సేవలో వీర మరణం చెందిన సైనికులను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యతని చెప్పారు . ఈరోజు శ్రీమతి చారులత , కిరణ్ ఉనియల్ ను ఆహ్వానించి వారిని నా ద్వారా సత్కరించి చెరొక 50 ,000 రూపాయల చెక్కులను అందించడం ఎంతో ఆనందముగా ఉందని అన్నారు . 
Womans Day Special Jayasudha In FilmNagar
ఈ సందర్భంగా పద్మపాణి ఆచార్య భార్య శ్రీమతి చారులత మాట్లాడుతూ . తను గర్భిణిగా వున్నప్పుడు తన భర్త మరణించాడని , గుండె ధైర్యంతో తట్టుకున్నానని , చాలా మంది వివాహం చేసుకొమ్మని సలహా ఇచ్చినా తాను చనిపోయేంతవరకు పద్మపాణి ఆచార్య భార్యగానే వుండదలుచు కున్నాని ఉద్వేగంగా చెప్పారు . 
ఈ కార్యక్రం ట్యాంక ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అధ్యక్షుడు కె.ఎల్ .నారాయణ చెప్పారు . ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు, , అక్కినేని శైలజ, శ్రీమతి నాగ సుష్మ , భగీరథ పాల్గొన్నారు , 

Related posts