ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేగింది.
దుర్గి పోలీసుల వల్ల తనకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు ఎవ్వరూ తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన రాజేశ్వరి ఎస్పీ స్పందన కార్యక్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని జీజీహెచ్కు తరలించారు. అయితే పురుగుల మందు వాసనకు ఓ మహిళా కానిస్టేబుల్ సడన్ గా అనారోగ్యానికి గురైంది.
ఓ మహిళ కానిస్టేబుల్ ఒక్కసారిగా తల పట్టుకుని సృహ తప్పికింద పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న మహిళా పోలీసులు ఆమెకు దెబ్బలు తగలకుండా పట్టుకున్నారు.
ఏపీలో ప్రతిపక్షం చేతులెత్తేసింది…