*వరుడుపై దాడి కేసులో ట్విస్ట్..
*విశాఖలో వరుడుపై వదువు దాడి,..
*సర్ ప్రైజ్ అంటూ కళ్ళ మూసుకోమని చెప్పి దాడి
*పుష్పతో పెద్దలు కుదిర్చిన పెళ్ళి..
*గొంతు కోశాక పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది..
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేకున్నా తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పి కాబోయే భర్తను పిలిచి అతి కిరాతకంగా కత్తితో దాడిచేసింది.
ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరుకు చెందిన రాము నాయుడికి అనకాపల్లి సమీపంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్ప అనే యువతితో పెళ్ళి నిశ్చయమయ్యింది. ఈ నెల 20న వీరి పెళ్ళి ముహూర్తం ఖరారు చేసారు. రాము నాయాడు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
పెళ్లికి సమయం దగ్గర పడుతుండంతో రామానాయుడు పెళ్ళిపనుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని ఏకాంతంగా కలుద్దామని వదువు కోరింది. ఆమె కోరిక మేరకు రావికమతం సమీపంలోని గుట్టలపైకి వెళ్లాడు. అక్కడ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా… కళ్ళు మూసుకోవాలని చెప్పడంతో యువకుడు అలాగే చేసాడు. ఒక్కసారిగా యువతి తనతో తెచ్చుకున్న కత్తితో కాబోయే భర్త గొంతుకోసింది.
దీంతో రక్తపుమడుగులో పడిపోయిన రాము ఎలాగోలా కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి హాస్పిటల్ కు తరలించారు. ఇలా మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చిన యువకుడు మెరుగైన వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
వరుడు గొంతుకు 30 కుట్లు వేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వరుడు వాయిస్ రికార్డు చేశారు.
ప్రాథమికంగా వధువు కు ప్రశ్నించగా ఈ పెళ్లి ఇష్ట లేదని చెప్పినా వినకుండా తమ పెద్దలు పెళ్లి చేస్తున్నారని యువతి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే యువతికి ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు..తనతో పుష్పను పంపాలని రామానాయుడే అడిగాడని వదువు (పుష్ప) తల్లి చెబుతోంది. నేనే అతనితో బయటకు పంపించాను , అతనే కోసుకుని మా అమ్మాయి మీద పెడుతున్నాడని చెబుతోంది.