మెక్ డొనాల్డ్స్ పై గతంలో పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెస్టరెంట్లో కొనుగోలు చేసిన చికెన్ వింగ్స్లో కోడి ఈకలు వచ్చాయంటూ బీజింగ్లో ఓ మహిళ మెక్డొనాల్డ్స్పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 21న మెక్డానాల్డ్స్కు చెందిన ఓ రెస్టరెంట్లో మహిళ చికెన్ వింగ్స్ను టేక్ ఎవే తీసుకుంది. తన కూతురు వింగ్స్ తింటున్న సమయంలో ఈకలు ఉండటం గుర్తించానని మహిళ ఆరోపిస్తోంది. అప్పటికే తన కూతురు తెలియకుండా మూడు వింగ్స్ తినేసిందని, కడుపంతా వికారంగా ఉన్నట్టు తనతో చెప్పిందని మహిళ వివరించింది. మిగతా వింగ్స్ను పరిశీలించగా వాటిలో ఈకలు ఉన్నాయని మహిళ తెలిపింది. రెస్టరెంట్ను సంప్రదించగా.. వారు కాంపెన్జేషన్ ఇస్తామని చెప్పారు. కాంపెన్జేషన్ను తిరస్కరించిన మహిళ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు రెస్టరెంట్పై ఫిర్యాదు చేసింది. ఆహార భద్రతపై మెక్డొనాల్డ్స్ తీసుకునే జాగ్రత్తలు ఇవేనా అంటూ మండిపడింది.
previous post
next post
కేసీఆర్ మొహం చాటేశాడు.. బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు