telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“థ్రిల్లర్” హాట్ బ్యూటీని కలిసే ఛాన్స్…!

Thriller

లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆడియన్స్. దీంతో వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ఓపెన్ చేసి ఆ వేదికపై వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం లాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలతో రచ్చ చేసిన వర్మ.. ఇప్పుడు అడల్ట్ కంటెంట్‌కి థ్రిల్లింగ్ అంశాలు జోడించి ‘థ్రిల్లర్’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ అప్సర రాణి అందాల విందు, రొమాంటిక్ డోస్ పుష్కలంగా ఉండనుందని ఇప్పటికే పలు పోస్టర్స్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ప్లాట్‌ఫాంలలో ఈ మూవీ చూడొచ్చని, ఒక్కో వ్యూ కోసం 200 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ మేరకు టికెట్ బుకింగ్స్ షురూ చేసి తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ”వెంటనే థ్రిల్లర్ టికెట్స్ బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో పాటు ఆర్జీవీని కలిసే ఛాన్స్ కొట్టేయండి” అంటూ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో హాట్ బ్యూటీని కలిసే ఛాన్స్ కోసం నెటిజన్లు పోటీ పడుతున్నారు.

Related posts