కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు ప్రకాష్ రాజ్. తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడం మాననని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘నా శక్తి మేరకు నేను సాయం చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. మీరు ఒకరి జీవితాన్ని నిలిపే సమయం ఇది’ అంటూ గతంలో ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు. తన ఆర్థిక వనరులు క్షీణించినా కూడా వెనక్కితగ్గనని, బ్యాంకులో రుణం తీసుకునైనా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను. భవిష్యత్లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన విపత్కర సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం’’ అని పేర్కొన్నారు. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న ఈ సమయంలో పేదలకు సహాయం చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
My financial resources depleting .. But Will take a loan and continue reaching out . BECAUSE I KNOW ….I CAN ALWAYS EARN AGAIN.. IF HUMANITY SURVIVES THESE DIFFICULT TIMES. .. #JustAsking 🙏Let’s fight this together.. let’s give back to life ..a #prakashrajfoundation initiative pic.twitter.com/7JHSLl4T9C
— Prakash Raj (@prakashraaj) April 20, 2020
ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాలే… సమీరా రెడ్డి