telugu navyamedia
క్రైమ్ వార్తలు

క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తెర్చిన భార్య ..

భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది అతని భార్య. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలో లక్ష్మీపతిపురంలో జరిగింది.

వివరాలిలా.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)కు ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదో తరగతి చదివే కుమార్తె ఆదిలక్ష్మి, మూడో తరగతి చదువుతున్న రాము కుమారుడు ఉన్నారు.

కాగా.. కొన్నినెలలుగా వేరే కాపురం పెట్టమంటూ భర్తను అడుగుతుండ‌డంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అప్పారావుకు దేవి మేనత్త కూతురు. వీరు ఒకే ఇంట్లో రెండు వేర్వురు గదుల్లో ఉండేవారు. ఇటీవల కోరంగి పోలీస్ స్టేషన్ లో గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ గొడవ విషయం అప్పారావు పనిచేస్తున్న కంపెనీలో తెలిసి పనిలో నుంచి తొలగించారు. అప్పటి నుంచి అప్పారావు ఇంట్లోనే ఉంటూన్నాడు. అప్పుల భారం అధికంగా ఉండడంతో భార్యను ఉద్యోగానికి వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం.

దీంతో దంపతుల మధ్య గొడవలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రమంలో.. ఆవేశంలో భార్య.. నిద్రిస్తున్న స‌మ‌యంలో భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. పిల్లలు లేచి చూసేసరికి తండ్రి నెత్తుటి మడుగులో ఉండడం, తల్లి కనిపించకపోవడంతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts