సాత్వికతను పాటించడం మనిషి ప్రధాన ధర్మం. అందుకే కొందరు వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టరు. మరి ఈ విషయం ఈ అమ్మడు పెళ్ళికి ముందు మాట్లాడుకోలేదేమో.. పెళ్లి తరువాత తెలుసుకొనేసరికి.. ఏకంగా విడాకుల వరకు వచ్చేసింది. అంతేనా.. ఏకంగా భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాంసపు ముక్క తినని భర్త తనకు వద్దనే వద్దని తెగేసి చెప్పింది. ఈ విచిత్రకర సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన రమ్య, రఘు అనే యువతీయువకులకు ఆర్నెల్ల క్రితం వివాహమైంది. వీరిలో రఘు మాత్రం పూర్తి శాఖాహార కుటుంబ నేపథ్యంలో పుట్టిపెరిగాడు. కానీ, రమ్యకు మాత్రం ముక్కలేని ముద్దదిగదు. దీంతో ఆర్నెల్లుగా భర్తను కూడా మాంసాహారిగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఆయన ససేమిరా మారలేదు.
దీనితో గతవారం పోలీసుల వద్దకు వచ్చి.. తన భర్త మాంసాహారం తిడన లేదని, అటువంటి వ్యక్తి తనకు భర్తగా వద్దని తెగేసి చెప్పింది. పైగా, ఆయన తన అలవాటును మార్చుకుంటారని, మాంసాహారిగా మారుతారని తాను ఆర్నెల్లుగా ఎదురు చూశానని కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చింది. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు ఆ భార్యభర్తలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ రమ్య తన పట్టును వీడలేదు. ముక్క ముట్టని భర్త తనకు వద్దనే వద్దని తెగేసి చెపుతోంది. దీనితో పోలీసులు మరోమారు ఈ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలని చూస్తున్నారు. అప్పటికీ రమ్య మారకుంటే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
బండి సంజయ్ నీవు ట్రాక్టర్ డ్రైవర్ వా?..