నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేకపోవడమే. రోహిత్ తప్పించడంతో అతనికి గాయమైందేమో అనుకున్నారు… కానీ, రొటేషన్ పద్ధతిలో భాగంగా హిట్మ్యాన్కు విశ్రాంతినిచ్చారని సమాచారం. 2021 టీ 20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టిన భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతో రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే తొలి మ్యాచ్కు రోహిత్ను దూరం పెట్టారు. టాస్ సందర్భంగా కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్ కు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే ఏది ఏమైనా జట్టులో రోహిత్ లేకపోవడం భారత్కు చేటు చేసింది అనేది మాత్రం స్పష్టంగా కనిపించింది.
previous post
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధ్వానపు చదువు: జయప్రకాశ్