telugu navyamedia
రాజకీయ వార్తలు

మానవాళితో సుదీర్ఘకాలం పాటు కరోనా: డబ్ల్యూహెచ్ఓ

who modi

మానవాళితో సుదీర్ఘకాలం పాటు కరోనా మహమ్మారి కలిసి నడవనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. చాలా దేశాలు వైరస్ తొలి దశలోనే ఉన్నందున నియంత్రణా చర్యల విషయంలో చిన్న తప్పు కూడా చేయవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కరోనాను నియంత్రించారని భావించిన దేశాల్లోనూ తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది.ముఖ్యంగా ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ ప్రమాదం అధికంగా పొంచివుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ అన్నారు.

ఇటీవల  జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయనవరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొవిడ్-19ను మహమ్మారిగా జనవరి 30నే గుర్తించిందన్నారు. దీంతో చాలా దేశాలకు వైరస్ ఎదుర్కొనే ప్రణాళికలను రూపొందించుకునే సమయం లభించిందని ఆయన అన్నారు. “పశ్చిమ యూరప్ లోని చాలా ప్రాంతాల్లో వైరస్ స్థిరంగా లేదా తగ్గుతూ ఉందన్నారు.

కొన్ని దేశాల్లో బాధితుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా, సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో, పశ్చిమ యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి విషయంలో చాలా దేశాలు తొలి దశలోనే ఉన్నాయి. ఈ దశలో ఏ చిన్న తప్పు కూడా చేయవద్దు. ఈ వైరస్ మనతో పాటు సుదీర్ఘకాలం పాటు ప్రయాణిస్తుందన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు.

Related posts