telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. కష్టాల్లో భారత్.. టపటపా వికెట్లు..

westindies test series india lost wickets

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. నార్త్ సౌండ్ లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పై పచ్చిక ఉండడంతో విండీస్ బౌలర్లు విజృంభించారు. దాంతో భారత్ 25 పరుగులకే 3 కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. కరీబియన్ బౌలర్లలో ముఖ్యంగా కీమార్ రోచ్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా టాపార్డర్ కు పరీక్ష పెట్టాడు.

మొదట ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5)ను ఓ అద్భుతమైన బంతితో అవుట్ చేసిన రోచ్, ఆ తర్వాత చటేశ్వర్ పుజారా (2)ను సైతం అలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం నిరాశపరిచాడు. కోహ్లీ 9 పరుగులే చేసి షానన్ గాబ్రియల్ బౌలింగ్ ల వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (11 బ్యాటింగ్), అజింక్యా రహానే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్ లో తెలుగుతేజం హనుమవిహారికి తుదిజట్టులో స్థానం లభించింది.

Related posts