పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి విషయం తెలిసిందే. ఈ అంశాలపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఏకం కావాలని విపక్ష పార్టీల నేతలను కోరారు. కేంద్ర ప్రభుత్వ అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా బెనర్జీ అన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీపై కులంతో సంబంధం లేకుండా భారత పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, చిన్నారులు, మహిళలు భయపడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. వాటిపై పోరాటానికి సీనియర్ నాయకులు, రాజకీయ నేతలు అందరూ ఏకమై పోరాటం చేయాలని కోరుతున్నట్టు తెలిపారు.