telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీ ఇంట విషాదం నింపిన కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది.  అయితే  అయితే తాజాగా వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇంట కరోనా విషాదం నింపింది. ఇవాళ ఉదయం మమతా బెనర్జీ తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కరోనా సోకి మృతి చెందారు. ఆషీమ్ బెనర్జీ కి కరోనా సోకడంతో.. అతన్ని కోలకతా లోని మెడికా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో ఆషీమ్ బెనర్జీ మృతి చెందారు. దీంతో సిఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కాగా వెస్ట్ బెంగాల్ లో గడిచిన 24 గంటల్లో 20,846 కొత్త కరోనా కేసులు నమోదవగా 136 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10, 94,802 కు చేరగా 12,993 కరోనా మరణాలు సంభవించాయి. 

Related posts