telugu navyamedia
సినిమా వార్తలు

తమిళ్ రీమేక్ లో ‘ఉప్పెన’

vuppena

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ రూపొందిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ కు ఇదే మొదటి సినిమా. కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. నాయకా నాయికలను తెలుగు తెరకి పరిచయం చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే తెలుగులో విడుదల కావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్ సేతుపతి, మైత్రి వారి నుంచి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, అక్కడ ఆయనే చేస్తాడని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Related posts