రమా రీల్స్ బ్యానర్పై జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా “ఓటర్”. ఈ చిత్రాన్ని జాన్సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తరవాత వాళ్లను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్గా ఈ సినిమాలో మంచు విష్ణు కనిపించబోతున్నాడని అర్దమవుతోంది. ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను తన తెలివితేటలతో హీరో ఎలాంటి గుణపాఠం నేర్పాడో చిత్రంలో చూపించనున్నారు. ఓటు విలువను తెలియజేసే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
next post