telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పింఛన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి…

అనంతపురం లోని శింగనమల నియోజకవర్గం లో పింఛన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి చేసాడు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ ఇప్పించాలంటూ గోవిందంపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ లోకేశ్వరరెడ్డి ని అడిగాడు వృద్ధుడు వెంకటరామిరెడ్డి. పింఛన్ ఇప్పించేందుకు గాను రూ.5 వేలు డిమాండ్ చేసాడు లోకేశ్వరరెడ్డి. ఎనిమిది నెలల క్రితం సోదరుడు రామకృష్ణారెడ్డి ద్వారా రూ.5 వేలు వాలంటీర్ కు ఇచ్చాడు వృదుడు వెంకటరామిరెడ్డి. నెలలు గడుస్తున్నా పింఛన్ రాకపోవడంతో డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ వాలంటీర్ లోకేశ్వరరెడ్డి ని వృద్దుడు అడిగాడు. అప్పుడు మద్యం మత్తులో వాలంటీర్ దాడి చెసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. వాలంటీర్ పై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసాడు. వాలంటీర్ ను సస్పెండ్ చేసారు అధికారులు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు వృద్దుడు వెంకటరామిరెడ్డి.

Related posts