telugu navyamedia
వార్తలు సామాజిక

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనతో నిలిచిన శ్రామిక్ రైళ్లు

vishakha gas leak

విశాఖ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వలస కూలీలను తరలించే సుమారు 9 శ్రామిక్ రైళ్లు నిలిచిపోయాయి. సింహాచలం నార్త్ రైల్వే స్టేష‌న్ నుంచి వివిధ ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌ల‌సిన రైళ్లు అక్క‌డే ఆగిపోయాయి.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో చిక్కుకుపోయిన వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు శ్రామిక్ రైళ్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఎల్‌జీ పాలిమ‌ర్స్ కెమిక‌ల్ ప్లాంట్ స‌మీపంలోనే సింహాచ‌లం రైల్వే స్టేష‌న్ ఉన్న‌ది. అయితే ప్ర‌మాద స‌మ‌యంలో రైల్వే సిబ్బంది కూడా శ్వాస‌కోస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కండ్లు కూడా మండిన‌ట్లు చెబుతున్నారు. ఆ స్టేష‌న్ రూట్లో ఉద‌యంనుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు రైళ్ల‌ను ఆపేశారు. 

Related posts