విశాల్ ‘టెంపర్’ రీమేక్ ‘అయోగ్య’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తరువాత సుందర్ సి దర్శకత్వంలో విశాల్ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. సుందర్ సి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్తచిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో విశాల్ రోమాన్స్ చేయనున్నాడు. మొదట ఈ చిత్రంలో మిల్క్బ్యూటీ తమన్నా, మళయాల ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మూడో హీరోయిన్గా ఛాయాసింగ్ను ఎంచుకున్నట్టు సమాచారం. సుందర్ సి, విశాల్ కాంబినేషన్లో గతంలో ‘మదగజ రాజా’, ‘ఆంబల’ చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. మూడవ చిత్రంగా ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘అత్తారింటికి దారేది’ రీమేక్గా శింబు హీరోగా నటించిన ‘వందా రాజావాదాన్ వరువేన్’ చిత్రం సుందర్ను నిరాశపరచడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిట్ కావడం విశాల్ కు కూడా అవసరమే.
previous post