తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా మూడు రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.
ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు లోపలికి వెళ్ళేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎగువ ఉన్న మెగాద్రి గెడ్డ నుంచి వచ్చే వరద నీరు ఎయిర్పోర్టులోకి వచ్చి చేరింది. గంట గంటకు వరద పెరగడంతో ఏ సమయంలోనైనా రన్ వే మీదకు వరద నీరు వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రస్తుతం నీరు బయటకు పంపే చర్యలు చేపట్టారు.
అలాగే విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్లో మోకాలి లోతు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా- వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. లంకెలపాలెం, గాజువాకల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది
ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల