telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విరాట్‌ కోహ్లీ పై ఐసీసీ చర్యలు.. మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత

virat kohili umpire

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పై ఐసీసీ చర్యలు తీసుకుంది. నియమావళి ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో ఐసీసీ 25శాతం కోత విధించింది. శనివారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్లూ దూకుడుగా అప్పీల్‌ చేసినందుకు, అంపైర్‌ అలీం దార్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవెల్‌ 1తో పాటు ఆర్టికల్‌ 2.1ను కోహ్లీ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది. ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా విధించింది. ప్రస్తుతం అతని ఖాతాలో డీమెరిట్‌ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. రిఫరీ క్రిస్‌బ్రాడ్‌ ముందు కోహ్లీ తప్పును అంగీకరించాడు.

అఫ్గ‌నిస్థాన్ ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 29వ ఓవ‌ర్ తొలి బంతిని డిఫెన్స్ ఆడ‌బోగా బంతి రహ్మ‌త్ షా ప్యాడ్‌కు త‌గిలింది. అప్పీల్ చేయ‌గా అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. దీనిపై కోహ్లీ అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బంతి వికెట్ల పైకి వెళ్తున్నా ఔట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మైదానంలో విచిత్ర హావ‌భావాలు, వ్యాఖ్య‌ల‌తో కోహ్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అనంత‌రం రీప్లేలో బంతి ర‌హ్మ‌త్‌షా బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న త‌ర్వాత ప్యాడ్‌కు త‌గిలిన‌ట్లు తేలింది.

Related posts