లాక్డౌన్ సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడు బిజీ షెడ్యూల్తో తీరిక లేకుండా గడిపే ఈ ఇద్దరు కరోనా పుణ్యమా అని ఆనందంగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ఓపిక విషయంలో క్రెడిట్ మొత్తం నా భార్యకే దక్కుతుంది. గతంలో నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నేను ప్రతీ చిన్న విషయానికి కొప్పడేవాడిని. ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంతిని నింపిందనుకుంటా. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయకపోవడంతో చాలా బాధపడ్డా.. రాత్రంతా కూర్చొని ఏడ్చా’ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు. 2013లో ఒక షాంపో యాడ్లో భాగంగా విరాట్, అనుష్కలు ఒకరొకొకరు పరిచయమయ్యారు. అనంతరం 2017లో పెళ్లి చేసుకున్నారు.
previous post