ఒక్కపాటతో ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిన సింగర్ రణుమొండల్. లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నాగ్మా హై అనే పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రీసెంట్గా రణు ఓ మాల్ ఓపెనింగ్కి హాజరు కాగా, ఆ సమయంలో ఓవర్ డోస్ మేకప్ వేసుకుందని విమర్శలు తలెత్తాయి. దీనిపై కూడా రణు ఇప్పటి వరకు స్పందిచకపోగా, మేకప్ ఆర్టిస్ట్ సంధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేల్చేసింది. ఒరిజినల్ ఫోటో, ఫేక్ ఫోటోని రెండు జత చేస్తూ.. జోక్స్, ట్రోల్స్ మనందరికి నవ్వు తెప్పిస్తాయి. కాని అవి ఇతరుల సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తాయి. ఇది మంచి పద్దతి కాదు. ఇప్పుడైన నిజానికి, ఫేక్కి తేడా తెలుసుకున్నారని భావిస్తున్నాను అని ఆమె తన పోస్ట్లో పేర్కొంది. అయితే ఇటీవల ఓ అభిమాని తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా, కాస్త దురుసుగా ప్రవర్తించి వార్తలలోకి ఎక్కింది. ఆ సంఘటనకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నెటిజన్స్ ఆమె ప్రవర్తనని తప్పుపట్టారు. ఒకప్పుడు ముంబై రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకునే రణు మొండల్… తన మూలాల్ని మర్చిపోయారా అని నెటిజన్లు నిలదీశారు. దీనిపై ఆమె ఏం స్పందించలేదు.
previous post
next post