telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గ్రామ వాలంటీర్ దారుణ హత్య…

 అనంతపురం జిల్లాలో గ్రామ వాలంటీర్ ను హత్యా చేసారు. కూడేరు మండలం శివరాం పేట గ్రామంలో పొలంలో ఆ గ్రామ వాలంటీర్  బోయ శ్రీకాంత్ ను  దుండగులు దారుణంగా హత్య చేశారు.  తెల్లవారుజామున పొలం వద్ద నిద్రిస్తున్న శ్రీకాంత్ ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని  గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పొలంవైపు వెళ్లిన స్థానికులు శ్రీకాంత్ డెడ్‌బాడీని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్ తండ్రి గ్రామంలో తరుచు కొడవలు గోడవపడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ పాత కక్షల కారణంగా హత్య జరిగిందా.. లేక మరెవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది కూడా రాజకీయాల పరంగానే జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts