telugu navyamedia
క్రైమ్ వార్తలు

వికారాబాద్ బాలిక హత్య కేసులో వీడిన మీస్ట‌రీ : ప్రియుడే హంతకుడు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య చేసిన ఘటనను పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడే హంత‌కుడ‌ని పోలీసులు నిర్ధారించారు. దీనికి కారణమైన ఆమె ప్రియుడు మహెందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కోటి రెడ్డి సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను ఒక వ్యక్తే హత్య చేసినట్లుగా వికారాబాద్ ఎస్పీ వెల్లడించారు. మహేందర్ (నాని) అనే వ్యక్తికి బాలికకు ఏడాది నుంచి బాగా పరిచయం ఉందని, వారి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయని తెలిపారు. ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉన్నట్లు చెప్పారు.

ఆ విషయం ఇంట్లో తెలవడంతో ఇంట్లో తిట్టారని అన్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ గొడవ పడ్డారని చెప్పారు. హత్యకు ముందు కూడా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకొని బయట కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిర్మానుష్య ప్రాంతంలో వారిద్దరూ కలుసుకున్న సమయంలో శారీరకంగా కలవాలని బాలికపై మహేందర్ ఒత్తిడి తీసుకొచ్చాడన్నారు. అయితే ఇందుకు బాలిక అంగీకరించలేదని… ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకొందన్నారు.

దీంతో నిందితుడు మహేందర్ బాలికను బ‌లంగా నెట్టివేయడంతో ఆమె చెట్టుకు తగిలి నుదుటిన పెద్ద దెబ్బతగిలింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయిందన్నారు.ఆ పరిస్థితుల్లో కూడా నిందితుడు ఆమెపై మహేందర్ అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలికకు ఊపిరాడక మరణించిందని ఎస్పీ వివరించారు

పోలీసుల విచారణ, డాక్టర్ల అభిప్రాయాలు, క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక అన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం మేం ఈ నిర్ధారణకు వచ్చామ‌ని తెలిపారు.

కాగా ఈ హత్యలో ప్రియుడు మాత్రమే పాల్గొన్నట్టు చెప్పారు. ఇతరుల ప్రమేయం ఏది లేదని వివరించారు. కాగా నేడు నిందుతున్ని కోర్టులో హజరుపరచనున్నట్టు చెప్పారు. నిందితునికి త్వరగా శిక్షపడేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

 

Related posts