తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పై సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను తెరిచినందుకు ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈవీఎంల రిగ్గింగ్ వల్లే ఓడిపోయామని కొడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
కేసు కోర్టులో ఉండగానే బెంగళూరు నుంచి వచ్చిన బెల్ ఇంజనీర్లు ఆ నియోజకవర్గాలకు చెందిన 100కు పైగా ఈవీఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేయడంతో వివాదాస్పదంగా మారింది. కేసు కోర్టులో ఉండగానే ఈవీఎం సీల్స్ తీయడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల పిటీషన్పై విచారణ జరిపిన ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.