telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయవాడ దుర్గమ్మ గుడిలో సంచలన విషయాలను బటయపెట్టిన ఏసీబీ

విజయవాడ దుర్గమ్మ గుడిలో అవకతవకలపై సంచనల విషయాలను బటయపెట్టింది ఏసీబీ నివేదిక. దుర్గమ్మ ఆస్తులకు రక్షణలేని పరిస్థితి ఉందని నివేదికలో పేర్కొంది. దుర్గగుడికి వందల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. అయితే… పదేళ్ల నుంచి ప్రాపర్టీ రిజిస్టర్ కూడా దేవస్థానం అధికారులు నిర్వహించడంలేదు. మూడేళ్లకు ఒకసారి ప్రాపర్టీ రిజిస్టర్ అప్డేట్ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. భూములు, లీజులు, ఆస్తుల రికార్డులను ఆలయ ఈవోలు పట్టించుకోలేదని నివేదికలో వెల్లడించారు. ప్రతి ఏడాది రిజిస్టర్ అప్డేట్ చేయాల్సి ఉన్నా… దాని పక్కన పడేశారని అంటున్నారు. దీని వల్ల ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తోంది ఏసీబీ నివేదిక.

Related posts