telugu navyamedia
వార్తలు

విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు…

విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు పడింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో చికిత్సకు అధిక ఫీజులు వ‌సూలు చేయ‌డం, ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకుంది.. బెజ‌వాడ‌లోని కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు.. భారీగా జ‌రిమానా విధించింది.. అందులో. సాయి దీపు ఆస్పత్రి, ఆంధ్రా ఆస్ప‌త్రికి చెరో రూ.ఆరు లక్షల ఫైన్ వేశారు అధికారులు.. స్మైల్ ఆస్ప‌త్రి, గుడివాడ ఈవీఆర్ ఆస్ప‌త్రికి చెరో రూ. ఆరు లక్షల జ‌రిమానా విధించారు. ఇక‌, లలిత లైఫ్ కేర్, లిబర్టీ ఆస్ప‌త్రికి చెరో రూ. 4 లక్షలు, క్రేన్, వేదాంత ఆస్ప‌త్రికి చెరో రూ.3 లక్షలు, సాయి మాధవి, సన్ రైజ్, పీవీ ప్రజ్ఞ ఆస్ప‌త్రుల‌కు రూ.రెండేసి లక్షల చొప్పున జ‌రిమానా విధించారు. దీంతో.. ఇప్పటి వరకు జిల్లాలో ప్రైవేట్ ఆస్ప‌త్రులపై రూ. 56 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించారు అధికారులు. అయితే మ‌రోవైపు.. విజయవాడ కరోనా వైద్యం నుంచి క్ర‌మంగా ప్రైవేట్ ఆస్ప‌త్రులు త‌ప్పుకుంటున్నాయి.. స్వచ్ఛందంగా కోవిడ్ వైద్యం అనుమతి రద్దు చేసుకున్నాయి నాలుగు ప్రైవేట్ ఆస్ప‌త్రులు.

Related posts