విజయవాడకి చెందిన తరుణ్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్ కి ఎన్నికయ్యారు. తరుణ్ ఎన్నికవ్వడం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలనుంచీ 20 మంది ఈ ఫెలోషిప్ కి ఎంపిక అవ్వగా ఆ 20 మందిలో తరుణ్ చెరుకూరి ఒకరు. భారతదేశం నుంచీ ఎన్నికైన ఏకైక వ్యక్తి, అందులోనూ తెలుగు వాడిగా రికార్డ్ క్రియేట్ చేశారు తరుణ్.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తరుణ్ కి ఫెలోషిప్ను అందజేయనున్నారు. తరుణ్ స్వచ్చంద సేవకుడిగా ఎంతో మందికి పరిచయం అయిన వ్యక్తే.. ఢిల్లీ కేంద్రంగా ఇండస్ యాక్షన్ పేరిట ఓ స్వచ్చంధ సంస్థని ఏర్పాటు చేసి, RTI అమలుకు ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా తరుణ్ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. ఇప్పటి వరకు 90 వేల మంది పేద విద్యార్థులను RTI పరిధిలో తీసుకువచ్చి స్కూల్స్ లో చేర్పించారు.