telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

విజయవాడ వ్యక్తికి.. ప్రతిష్టాత్మకమైన ఒబామా ఫెలోషిప్ ..

vijayawada person tarun got obama fellowship

విజయవాడకి చెందిన తరుణ్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్ కి ఎన్నికయ్యారు. తరుణ్ ఎన్నికవ్వడం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలనుంచీ 20 మంది ఈ ఫెలోషిప్ కి ఎంపిక అవ్వగా ఆ 20 మందిలో తరుణ్ చెరుకూరి ఒకరు. భారతదేశం నుంచీ ఎన్నికైన ఏకైక వ్యక్తి, అందులోనూ తెలుగు వాడిగా రికార్డ్ క్రియేట్ చేశారు తరుణ్.

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తరుణ్ కి ఫెలోషిప్‌ను అందజేయనున్నారు. తరుణ్ స్వచ్చంద సేవకుడిగా ఎంతో మందికి పరిచయం అయిన వ్యక్తే.. ఢిల్లీ కేంద్రంగా ఇండస్‌ యాక్షన్‌ పేరిట ఓ స్వచ్చంధ సంస్థని ఏర్పాటు చేసి, RTI అమలుకు ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా తరుణ్ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. ఇప్పటి వరకు 90 వేల మంది పేద విద్యార్థులను RTI పరిధిలో తీసుకువచ్చి స్కూల్స్ లో చేర్పించారు.

Related posts