telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు, బొండా ఉమ‌కు ఏపీ మహిళా కమిషన్ సమన్లు..

*విజయవాడలో వాసిరెడ్డి ప‌ద్మ‌ను అడ్డుకున్న టీడీపీ నేత‌లు..
*చంద్ర‌బాబు, బొండా ఉమ‌కు మహిళా క‌మిష‌న్ స‌మ‌న్లు..
*మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి స్వ‌యంగా హాజ‌రుకావాల‌ని స‌మ‌న్లు..

తెదేపా అధినేత చంద్ర‌బాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులకు మహిళా క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేశారు. ఈ నెల 27 న విజయవాడలో మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి స్వయంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్య‌చార బాధితురాల‌లిని  ప‌రామ‌ర్శించేందుకు వెళ్ళిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కమీషన్ చంద్రబాబు, బొండా ఉమాలకు సమన్లు జారీ చేసింది.

అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించనీయకుండా, ఆమె ఆవేదనను వినకుండా కమీషన్ ఛైర్‌పర్సన్‌‌ విధులకు ఆటంకం కలిగించారని వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు. అంతేకాకుండా వాసిరెడ్డి పద్మపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారని కమీషన్ ఆరోపించింది. 

Related posts