ఓ ప్రధానమంతికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్లో కాంగ్రెస్ తరఫున విజయశాంతి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంతి నరేంద్ర మోదీ వంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ దుయ్యబట్టారు. నేను బీజీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యమేమిటో తెలుసన్నారు.
ఈ ఎన్నికలు రాహుల్గాంధీ, మోదీల మధ్య పోరు అంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో మోదీ కేవలం అబద్ధాలతోనే దేశాన్ని మోసగించారని దుయ్యబట్టారు.బీజీపీ ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సేడంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలబురగి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.