telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టింది: విజయశాంతి

vijayashanthi

తెలంగాణ సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసులు పెరుగుతుంటే నిజాలను మరుగుపరిచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. తమ ఆదేశాల అమలుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం హెచ్చరించేలా పరిస్థితి దిగజారిందని విజయశాంతి ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

న్యాయస్థానం వ్యాఖ్యలతో పాలకుల నిజస్వరూపం బట్టబయలైంది. చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికొదిలేశారన్న కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక తెలంగాణ సర్కారు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇది చాలక మరోవైపు ప్రైవేట్ నర్సుల దుస్థితిపై హెచ్చార్సీ నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు నోటీసులు అందుకున్నారని విమర్శలు గుప్పించింది.

Related posts