కరోనా కేసులు పెరగడానికి వైన్ షాపులను తెరవడమే కారణమని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలు లాక్ డౌన్ ను నిజాయతీగా పాటించారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రోజుల పాటు ప్రజలంతా చాలా నిబద్దతతో లాక్డౌన్ ను పాటించారని, అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. పాజిటివ్ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండన్నారు. సరైన సంఖ్యలో పరీక్షలను ఇప్పటి వరకూ చేయకుంటే ఆ నిజాన్ని ఒప్పుకోండి. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ