telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీని సంతృప్తి పరచడానికే ఎగ్జిట్ పోల్స్: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే తీరులో ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీని సంతృప్తి పరచడానికే ఈ విధమైన అంచనాలు వెల్లడించినట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు.

ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి మురిసిపోతున్న బీజేపీని చూసి జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. 2014లో మోదీ ప్రభంజనం ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రాలేదని, అలాంటిది ఇప్పుడాయనపై ఎంతో వ్యతిరేకత ఉందనన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. మోదీ హవా నిజమే అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో ఎందుకు బీజేపీ వెనుకబడిందని ప్రశ్నించారు.

Related posts