ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి టీడీపీన టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది.” అని ట్వీట్ చేశారు. అంతకు ముందు ట్వీట్ లో “అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం ఏనాడైనా నోరు విప్పారా బాబూ! ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా వచ్చి రెచ్చగొట్టే స్పీచులు దంచిపోవడమే ప్రజా సేవ అనుకుంటే ఎలా? జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా రాష్ట్రానికి పనికొచ్చే సలహాలు ఇవ్వండి.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
previous post