telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు పిచ్చి అందరికీ అంటించాడు : విజయసాయిరెడ్డి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడుని నిన్న అరెస్ట్‌ చేశారు. అయితే.. అరెస్ట్‌ తర్వాత అచ్చెన్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబును అడిగి హోం మినిష్టర్‌ అవుతానని అచ్చెన్నాయుడు పోలీసులతో అన్నారు.  అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశాడు. “కాబోయే హోం మినిష్టర్ అచ్చెన్నంట. క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించడానికి బిస్కెట్ వేశాడు. చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటాడు. బహిరంగపరిస్తే ఎలా అచ్చెన్నా. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారంట. పిచ్చి అందరికీ అంటించాడు బాబు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్‌ లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. “పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి? ” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Related posts