telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెంకయ్య నాయుడుకు విజయసాయిరెడ్డి లేఖ… కారణమిదే !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ప్రతిపక్షాలపై దాటిగా ఎదురు దాడి చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. టీడీపీ ఎంపీ కనకమేడల అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాద తీర్మానంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తొలగించక పోవడం దురదృష్టకరమని తెలిపారు. పార్లమెంట్ నిబంధన 238(5), (3) ఉల్లంఘించారని.. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షాను కలిసి తప్పుదోవ పట్టించే సమాచారం అందజేశారని.. మత విద్వేషం, హింసకు పాల్పడుతున్నారని తప్పుడు ఆధారాలు ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ హిందు దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనకు సంబంధించిన వీడియోను చూపించారని..దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Related posts