చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ అంటేనే ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ అని వైసీపీ నేత ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విటర్లో ధ్వజమెత్తారు. రీ పోలింగ్కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈసీపై దాడికి యత్నించే తప్పేం జరిగిందని? ప్రశ్నించారు.
పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా? అని నిలదీశారు.చంద్రబాబు ఆయన కుల మీడియా చేస్తున్న మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయని దుయ్యబట్టారు..గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుందని ట్విటర్లో విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు