వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి నదిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ ప్రభుత్వానిదే అని వెంకన్న ఎద్దేవా చేశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో బోటు వెళ్లడానికి అనుమతించిన మీ మంత్రి ఎవరని అడిగారు.
ఇప్పటి వరకు ఎంత మంది మృత దేహాలను వెలికి తీశారని, ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రశ్నించారు. గోదావరిలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 25 లక్షల నష్ట పరిహారాన్ని ఎప్పుడు ఇస్తున్నారని అడిగారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. దీనికి బాధ్యతగా మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు: దివ్యవాణి