telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విజయసాయిరెడ్డి, మిథున్, భారత్ లకు .. జగన్ కీలక పదవులు..

vijayasai reddy

ఏపీసీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇదే సమయంలో లోక్ సభలో వైకాపా పక్షనేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లోక్ సభలో వైకాపా విప్ గా మార్గాని భరత్ లను నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి జగన్ ప్రత్యేక లేఖను పంపారు.

తమ పార్టీ తరఫున వీరిని గుర్తించాలని ఆయన కోరారు. ప్రస్తుతం విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, మిథున్ రెడ్డి, భరత్ లు తాజా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Related posts