telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విజయనగరం : .. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ … ఏర్పాట్ల పరిశీలన..

vijayanagaram sp on arrangements of sirimanostav

అక్టోబర్ 15న నిర్వహించాల్సిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రాంతాలను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏ.ఎస్పీ, ఓఎస్డీ లతో కలిసి పరిశీలించారు. హుకుంపేట నుండి సిరిమాను తీసుకొని వచ్చే మార్గమును, సిరిమాను తిరిగే ప్రాంతాలను, పైడితల్లమ్మ దేవాలయం వద్ద భక్తుల క్యూలైన్లు, విఐపి క్యూ లైన్లు ఏర్పాట్లను చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించి, అనుభవజ్ఞుల నుండి వివరాలను సేకరించి, చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలకు, భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని రాజకుమారి తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట ఓ ఎస్ డి రామ్మోహన్ రావు, అదనపు ఎస్పీ ఎన్ శ్రీదేవీ రావు, విజయనగరం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి, ఎస్.బి. డి.ఎస్.పి సీఎం నాయుడు, ట్రాఫిక్ డిఎస్పి మోహనరావు, సిసిఎస్ డిఎస్పి పాపారావు, సి.ఐలు శ్రీహరి రాజు, ఎర్రన్నాయుడు, రమేష్, పూజారి వెంకట రావు, దేవాదాయ శాఖాధికారులు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts