ఉత్తరప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తాను నటించిన ప్రతిఘటన సినిమాలోని ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో’ అనే పాటను గుర్తు చేస్తూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.దేశంలోని మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి విన్నప్పుడల్లా తనకు ప్రతిఘటన సినిమాలోని ఈ పాటే తనకు గుర్తుకొస్తుందని విజయశాంతి అన్నారు.
నిర్భయ, దిశ ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో తన పిల్లలతో కలసి బస్సు ఎక్కిన ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నైతికంగా సమాజం శక్తిమంతం కానంత వరకూ ఈ వ్యవస్థలో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
రెండు గాజులు ఇస్తే ఎవరు నమ్మరు.. నారా భువనేశ్వరిపై రోజా ఫైర్